సింహాద్రి అప్పన్నకు అవంతి పూజలు..
Ens Balu
2
Simhachalam
2021-05-28 14:02:13
విశాఖలోని సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారికి రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజనాభివృద్ది, క్రీడాశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు శుక్రవారం ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. తర్వాత రెండవ సారి స్వామికి చందనం సమర్పించిన స్వామివారిని మంత్రి దర్శించుకుని, ఆపై కప్పస్తంభం ఆలింగనం చేసుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు. ఆలయ ఈఓ మంత్రికి ముత్తంశెట్టికి ప్రసాదాలను అందించారు. ఈ కార్యక్రమంలో సింహాచలం బోర్డ్ సభ్యులు, స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు.