గోకుల్ పార్కును అభివ్రుద్ధి చేయండి..


Ens Balu
2
Visakhapatnam
2021-05-28 15:59:17

మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ నాలుగవ జోన్ పరిధిలోని 29వార్డులో గల గోకుల్ పార్కును అభివృద్ధి చేయాలని రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన జివిఎంసి మేయర్ గొలగాని హరి వెంకట కుమారితో కలసి బీచ్ రోడ్లో ఉన్న గోకుల్ పార్కును సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గోకుల్ పార్కును అభివృద్ధి పరచి పర్యాటకులను ఆకట్టుకునే విధంగా తయారు చేయాలని ఆదేశించారు. యాదవలకు అన్ని సౌకర్యాలతో కూడిన ఒక సామాజిక భవనం నిర్మాణానికి  రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెల్తామని హామీఇచ్చారు. అనంతరం బీచ్ రోడ్డులో ఉన్న రాదాకృష్ణ మందిరానికి సందర్శించారు. ఈ పర్యటనలో నగర అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్, ఒమ్మి సన్యాసిరావు, మొల్లి అప్పారావు, 29వ వార్డు కార్పొరేటర్ ఉరికిటి నారాయణ రావు, 11 వార్డు ఇంచార్జ్ గొలగాని శ్రీనివాస్, యాదవ సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.   
సిఫార్సు