జూన్2న అప్పన్న హుండీ లెక్కింపు..
Ens Balu
2
Simhachalam
2021-05-29 11:36:28
విశాఖలోని సింహాచలం శ్రీశ్రీశ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామివారి దేవస్థానం హుండీల లెక్కింపు జూన్2న చేపట్టనున్నట్టు ఆలయ ఈఓ ఎంవీసూర్య కళ తెలియజేశారు. ఈ మేరకు శనివారం దేవస్థానంలో ఆమె మీడియాతో మాట్లాడారు. దేవాదాయశాఖ కమిషనర్ సూచనల మేరకు వచ్చే నెలలో లెక్కింపు చేపట్టనున్నట్టు వివరించారు. దీనికోసం కొండపైనా బేడా మండపంలో కోవిడ్ నిబంధనలు ద్రుష్టిలో పెట్టుకొని అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్టు చెప్పారు. ఈ లెక్కింపు కార్యక్రమానికి ప్రత్యేక పర్యవేక్షణ కూడా చేపట్టనున్నామన్నారు ఈఓ. ప్రస్తుతం నిబంధనలు అనుసరించి భక్తులకు స్వామివారి దర్శనాలు చేపడుతున్నామని చెప్పారు.