మే 30న అప్పన్నకు స్వర్ణ పుష్పార్చన..


Ens Balu
2
Simhachalam
2021-05-29 12:41:03

విశాఖలోని సింహాచలం శ్రీశ్రీశ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామివారి దేవస్థానంలో మే 30న స్వామివారి స్వర్ణపుష్పార్చన నిర్వహిస్తున్నట్టు దేవస్థాన ఈఓ ఎంవీ సూర్యకళ తెలియజేశారు. శనివారం ఈ మేరకు ఆమె దేవస్థానంలో మీడియాతో మాట్లాడారు. శ్రీశ్రీశ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామివారికి నిర్వహించే స్వర్ణ పుష్పార్చనలో భక్తులు ఆన్ లైన్ ద్వారా పాల్గొన వచ్చునన్నారు. దానికి గాను ముందుగా టిక్కెట్టు చెల్లించిన వారికి ఆన్ లైన్ యూట్యూబ్ లింక్ పంపిస్తామని చెప్పారు. భక్తులు ఆదివారం సాయంత్రం 6 గంటల్లోపూ టిక్కెట్టు మొత్తం ఆన్ లైన్ పేమెంట్ చేయవచ్చునన్నారు. దానికోసం భక్తులు  దేవస్థానం అకౌంట్ UPI ID:9491000635@SBI కుగానీ, ఆన్ లైన్లో SBI అకౌంట్ నంబర్ EO,SVLNS devasthanam  11257208642, IFCS code SBIN0002795కు గాని,  నిర్ణీత రుసుము చెల్లించి స్వర్ణ పుష్పార్చనలో పాల్గొనవచ్చునన్నారు.  ఆన్ లైన్ లో డబ్బులు పంపాక తప్పకుండా దాని స్క్రీన్ షాట్ ఫొటో తీసి , మీ పేరు, గోత్రం తదితర వివరాలు  6303800736 నంబర్ కు వాట్సప్, మెసేజ్ ద్వారా  పంపించాల్సి వుంటుందన్నారు.  భక్తుల సందేహాలను కూడా ఇదే నెంబరు ద్వారా నివ్రుత్తి చేసుకోవచ్చునన్నారు.
సిఫార్సు