ప్రతీ రోజు త్రాగునీరు సరఫరా కావాలి..


Ens Balu
3
Gajuwaka
2021-05-29 14:01:10

మహావిశాఖ నగరపాలక సంస్థ పరిధిలోని ప్రజలకు తాగునీటి సరఫరాలో అంతరాయాలు లేకుండా చూస్తూ నిత్యం మంచినీరు సరఫరా చేయాలని జివిఎంసీ కమిషనర్ డా.జి.స్రిజన అధికారులను ఆదేశించారు.  శనివారం గాజువాక జోన్ 65వ వార్డు పరిధిలోని సుందరయ్య కోలనీలో  కమిషనర్  పర్యటించారు. సుందరయ్య కోలనీలో మంచినీరు ప్రతి రోజు ఇవ్వడం లేదని వచ్చిన ఫిర్యాదుల మేరకు ఆమె సుందరయ్య కోలనీలోని పంపు హౌస్ ను సందర్శించి మంచినీరు ప్రతీ రోజు ఇవ్వకపోవడం పై గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. కొన్ని మోటార్లు పని చేయడం లేదని, అందువలన ప్రతీ రోజు మంచినీరు అందించడంలో ఇబ్బందులు తలెత్తాయని పర్యవేక్షక ఇంజినీరు బదులిచ్చారు. మోటారులను వెంటనే రిపేరు చేయించాలని అంతవరకు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా మంచి నీరు అందించాలని పర్యవేక్షక ఇంజినీరును ఆదేశించారు.  ఈ పర్యటనలో పర్యవేక్షక ఇంజినీరు కె.వి.ఎన్.రవి, కార్యనిర్వాహక ఇంజినీరు   పి. వెంకటరావు, ఉప కార్యనిర్వాహక ఇంజినీరు (ఎలక్ట్రికల్) లక్ష్మోజీ తదితరులు పాల్గొన్నారు.    
సిఫార్సు