శంఖుస్థాపన మహోత్సవంలా జరగాలి..
Ens Balu
4
Kakinada
2021-05-29 14:40:56
కాకినాడ రూరల్ నియోజకవర్గ పరిధిలో జూన్ 1 నుండి 7వ తేదీ వరకూ జగనన్న కాలనీల శంఖుస్థాపన మహోత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేపట్టాలని రాష్ట్ర వ్యవసాయ, సహకార,మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కురసాల కన్నబాబు హౌసింగ్ అధికారులను ఆదేశించారు. శనివారం మంత్రి కన్నబాబు తమ క్యాంపు కార్యాలయంలో హౌసింగ్ అధికారులతో సమావేశమై కాకినాడ రూరల్ నియోజకవర్గంలో నవరత్నాలు-పేదలందరికీ ఇళ్ల నిర్మాణ పధకం మొదటి దశ క్రింద ఎంపికైన 13585 మంది లబ్ధిదారులతో జూన్1నుంచి7వరకు నిర్వహించనున్న జగనన్న కోలనీల శంఖుస్థాపన మహోత్సవాల కార్యక్రమాల్లో ఇళ్ల నిర్మాణానికి గ్రౌండింగ్ కు చేపట్ట వలసిన ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసేందుకు అవసరమైన ఫిల్టర్ పాయింట్లు, బోర్ వెల్ లు, విద్యుత్ సరఫరా వంటి మౌళిక సదుపాయాలను నియోజకవర్గ పరిధిలోని 49 లేఅవుట్ లలో వెంటనే కల్పించాలని అయన అధికారులను ఆదేశించారు. అలాగే లబ్ధిదారులకు అవసరమైన నిర్మాణ సామాగ్రి అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు. అలాగే నియోజకవర్గంలో రెండవ దశ గృహాల నిర్మాణానికి సమగ్ర ప్రాజెక్ట్ రిపోర్టులు సమర్పించాలని మంత్రి హౌసింగ్ ఇంజనీర్లను ఆదేశించారు. ఈ సమావేశంలో కాకినాడ రూరల్ హౌసింగ్ డిఈఈ కెవిఆర్ గుప్తా, ఏఈ ఎన్.శ్రీనివాస్ పాల్గొన్నారు.