విశాఖలోని సింహాచలం శ్రీశ్రీశ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామివారి దేవస్థానంలో ఆదివారం స్వామివారి ఆలయంలో ప్రత్యేక శుభ్రత కార్యక్రం చేపట్టారు. చాలా కాలం నుంచి శుభ్రపరచి ఆలయంలోని ఇత్తడి, రాగి గ్రిల్స్ ను నేడు ప్రత్యేకంగా శుభ్రపరిచారు. అంతేకాకుండా కళ్యాణ మండపంలోని అన్ని గ్రిల్స్ ను పాలిష్ చేశారు. దీనితో స్వామివారి ఆలయంలోపల అన్ని గ్రిల్స్ కొత్తవాటిలా తళ తళ మెరుస్తూ కనిపించాయి. ఆలయంలోకి వచ్చే భక్తులకు లోపలి వాతావరణం అంతా చాల పరిశుభ్రంగా కనిపించాలనే ఉద్దేశ్యంతో ఈ ప్రత్యేక క్లీన్ డ్రైవ్ కార్యక్రమం చేపట్టినట్టు ఆలయ ఈఓ ఎంవీసూర్యకళ తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని ఇకపై ఎప్పటికప్పుడు చేపట్టి భక్తులకు ఆలయంలో సరికొత్త అనుభూతి కలిగించే ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు.