ఎన్ ఆర్ సి తీర్మానం పై ముస్లింలు హర్షం


Ens Balu
2
2020-06-21 21:09:56

దేశంలో మైనారిటీలను అబధ్రతా భావానికి గురి చేసిన ఎన్ ఆర్ సి, ఎన్ పి ఆర్ లను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన తీర్మానం పట్ల రాష్ట్రంలోని మైనార్టీల హర్షం వ్యక్తం చేస్తున్నారని వైఎస్ఆర్ సీపీ మైనార్టీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐ హెచ్ ఫరూఖి తెలిపారు. ఈ మేరకు ఆయన విజయసాయిరెడ్డిని కలసి కృతజ్ఞతలు తెలియజేశారు. శాలువా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా ఫరూఖి మాట్లాడుతూ అసెంబ్లీ తీర్మానం పట్ల కృతజ్ఞత తెలుపుతూ విశాఖ ముస్లింల అందరి తరపున ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని తెలిపారు. ఎంపీ విజయసాయిరెడ్డి ప్రగతి భారతి ట్రస్ట్ తరఫున రంజాన్ సందర్భంగా 25 వేల కిట్లను ముస్లిం సోదరులకు అందజేశారు అన్నారు. అందుకు విజయసాయి రెడ్డి కి కృతజ్ఞతలు తెలియజేశారు. పెందుర్తి అహ్మద్ నగర్ సొసైటీ తరఫున రహదారి నిర్మాణానికి వినతిపత్రం అందజేశామని అన్నారు. కార్యక్రమంలో ఆల్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి నూర్ మహమ్మద్ తదితరులు పాల్గొన్నారు.