సీఎం వైఎస్ జగన్ పాలన ఒక మైలురాయి..


Ens Balu
2
మద్దెలపాలెం
2021-05-30 08:53:08

రాష్ట్ర అభివృద్ధి తో సమాంతరంగా విశాఖ అభివృద్ధికి కంకణం కట్టుకున్న ఏకైక సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డి మాత్రమేనని విశాఖ వైఎస్సార్సీపీ నగర అధ్యక్షుడు సీహెచ్ వంశీ క్రిష్ణ శ్రీనివాస్ అన్నారు. వైఎస్సార్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఆదివారం మద్దెలపాలెం పార్టీ కార్యాలయంలో జెండా ఎగురవేసి కేక్ కట్ చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర అభివ్రుద్ధిలో భాగంగా విశాఖను పరిపాలన రాజధానిగా మార్చి ఈ ప్రాంతానికి మరింత గుర్తింపు వచ్చేలా చేశారన్నారు. అధికారంలో వున్న సమయలో 100 మీటింగులు పెట్టిన చంద్రబాబు ఒక్క శాస్వత అభివ్రుద్ధి పని చేపట్టలేదన్నారు. దివంగత ముఖ్యమంత్రి చేసిన అభివ్రుద్ధిని తన ఖాతాలో వేసుకొని ప్రచారం చేసుకున్న చేత గాని వ్యక్తిగా అభివర్ణించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్, రాజ్యసభ సభ్యులు వి.విజయసాయిరెడ్డి చేస్తున్న అభివృద్ధి పనులు చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని.. దేశంలో ఎవరూ చేయని సంక్షేమ అభివృద్ధి పథకాలను ఆంధ్రప్రదేశ్ లో సీఎం జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టి ప్రజల మనసులు గెలుచుకున్నారని వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు.  ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ టెక్నాలజీ విభాగం నాయకులు శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.