బాపట్ల మెడికల్ కాలేజీ చరిత్రలో నిలిచిపోతుంది..


Ens Balu
1
Bapatla
2021-05-30 12:03:27

గుంటూరు జిల్లాలో బాపట్లకు మెడికల్ కళాశాల తలమానికంగా ఉంటుందని రాష్ట్ర శాసన సభ ఉప సభాపతి కోన రఘుపతి పేర్కొన్నారు. బాపట్లలో మెడికల్ కళాశాల భవనాలకు సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో అక్కడి ఏర్పాట్లను ఆదివారం రాష్ట్ర శాసన సభ ఉప సభాపతి కోన రఘుపతి, జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్తో కలిసి పరిశీలించారు. మెడికల్ కళాశాల కోసం కేటాయించిన స్థలంను, మెడికల్ కశాశాల భవనం, ఆస్పత్రి భవనాల మ్యాప్లను  పరిశీలించారు. ప్రారంభోత్సవం సంధర్భంగా చేస్తున్న ఏర్పాట్ల పై డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ అధికారులకు సూచనలు ఇచ్చారు. విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని, వర్చువల్ పద్దతిలో ముఖ్యమంత్రి ప్రారంభోత్సవం చేస్తున్నందున  ఇంటర్ నెట్ బ్యాండ్ విడ్త్ సక్రమంగా ఉండేలా చూడాలన్నారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ముఖ్య అతిధులకు, ఆహ్వానితులకు సీటింగ్ ఎరేంజ్ మెంట్ చేయాలన్నారు. ఈ సంధర్భంగా రాష్ట్ర శాసన సభ ఉప సభాపతి కోన రఘుపతి మాట్లాడుతూ బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు, 20 కీమీ పరిధిలోని ప్రజలకు మెడికల్ కళాశాలలో భాగంగా ఏర్పాటు చేస్తున్న  500 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి  ద్వారా మెరుగైన వైద్యసేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపిన విధంగా మెడికల్ కళాశాల ఏర్పాటుతో బాపట్ల మెడికల్ హబ్గా మారిపోతుందన్నారు. రాష్ట్రంలో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం జిల్లాగా ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించినందున త్వరలో జిల్లా కేంద్రంగా మారనున్న బాపట్లలో మెడికల్ కళాశాల ఏర్పాటుతో వైద్యసేవలు అందుబాటులో ఉంటాయన్నారు. కోవిడ్ నేపథ్యంలో పరిమిత సంఖ్యలోనే ముఖ్యులను ఆహ్వానించటం జరుగుతుందని, కార్యక్రమం మొత్తం లైవ్ టెలికాస్ట్ చేయటం జరుగుతున్నందున ప్రజలు సహకరించాలని కోరారు.

జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ మాట్లాడుతూ జిల్లాలో బాపట్ల, పిడుగురాళ్ళలో మెడికల్ కళాశాల భవనాల నిర్మాణానికి  రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వర్చువల్ పద్దతిలో శంకుస్థాపన కార్యక్రమంకు అవసరమైన ఏర్పాట్లును కోవిడ్ ముందస్తు జాగ్రత్త చర్యలు పాటిస్తూ  సిద్దం చేయటం జరిగిందన్నారు. బాపట్లలో మెడికల్ కళాశాల ఏర్పాటు ఈ ప్రాంత ప్రజలకు వరంలాంటిదన్నారు. కోవిడ్ మహమ్మారితో  ప్రజలకు వైద్యసౌకర్యం ఎంతో ముఖ్యమో ప్రపంచానికి తెలిసిందన్నారు. కోవిడ్ నేపథ్యంలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేయటం ఎంతో హర్షించదగ్గ అంశం అన్నారు. ఈ కార్యక్రమంలో తెనాలి సబ్ కలెక్టర్ మయూర్ అశోక్, బాపట్ల మున్సిపల్ కమిషనర్ బాను ప్రకాష్, తహశీల్దారు శ్రీనివాసరావు, ఏపీఎంఐడీసీ అధికారులు, రెవెన్యూ, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

సిఫార్సు