సమాచారశాఖ డిడిగా బి.పూర్ణచంద్రరావు..


Ens Balu
1
Kakinada
2021-05-31 10:30:34

తూర్పు గోదావరి జిల్లా, సమాచార పౌర సంబంధ శాఖ నూతన ఉప సంచాలకులుగా బి.పూర్ణచంద్రరావు సోమవారం ఉద్యోగ భాద్యతలు స్వీకరించారు.  అసిస్టెంట్ డైరక్టరుగా విజయవాడ సమాచార శాఖ కమీషనరేట్ లో ప్రత్యేక విధులు నిర్వహిస్తూ ఆయన డిప్యూటీ డైరక్టరుగా పదోన్నతిపై తూర్పు గోదావరి జిల్లాలో నియమితు లైయ్యారు.  గతంలో ఆయన శ్రీకాకుళం జిల్లా అసిస్టెంట్ డైరక్టర్ గానూ,  ప్రకాశం, గుంటూరు జిల్లాల డిపిఆర్ఓగాను పనిచేశారు.   డిప్యూటీ డైరక్టర్, తూగో జిల్లా పదవి బాధ్యతలను ఆయన సోమవారం ఉదయం ప్రస్తుతం ఈ పదవి  ఇన్ చార్జిగా వ్యవహరిస్తున్న జోన్-2 జాయింట్ డైరక్టర్ ఎల్.స్వర్ణలత నుండి స్వీకరించారు. ఈ సందర్భంగా డిడి పూర్ణచంద్రరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాల సమాచారాన్ని జిల్లా ప్రజలకు, ప్రజల అభిప్రాయాలను, ఆకాంక్షలను ప్రభుత్వానికి సమాచార శాఖ ద్వారా తెలియజేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. అలాగే మీడియా సంస్థలు, ప్రతినిధులకు ప్రభుత్వ పరమైన సంక్షేమాలు సమగ్రంగా అందేలా కృషి చేస్తాని తెలియజేశారు. ఆయనకు కార్యాలయ డివిజనల్ పిఆర్ఓలు పి.రవి (కాకినాడ), యండి.విలాయత్ ఆలీ (అమలాపురం), వి.వి.రామిరెడ్డి (రాజమహేంద్రవరం), ఐ.సాయిబాబు (పెద్దాపురం), ఏపిఆర్ఓ కె.రవి, ఎవిఎస్ డి.ధర్మరాజు, పబ్లిసిటీ అసిస్టెంట్ సిహెచ్.రాంబాబు,  సీనియర్ అసిస్టెంట్ వి. శేఖర్, టైపిస్టులు బషీర్ అహ్మద్, జి.స్వరాజ్యకుమారి, సిబ్బంది ఎన్.చిట్టిరాజు, కె.గోపీకృష్ణ, యం.మాధవకృష్ణ, లక్ష్మీకాంతం, ఎస్.రాజేష్, యం.సతీష్, సూర్యనారాయణ, సూరిబాబు తదితరులు ఆయనకు అభినందనలు తెలియజేశారు.
సిఫార్సు