వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వైద్యవిద్య కు అత్యధిక ప్రాధన్యం..


Ens Balu
1
Madanapalle
2021-05-31 10:54:27

విద్యా, వైద్య రంగానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి & ఎక్సైజ్ వాణి జ్య పన్నుల శాఖ మంత్రి  కె.నారా యణ స్వామి పేర్కొ న్నారు. సోమవారం ఉదయం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి వర్చువల్ విధానం లో రాష్ట్ర వ్యాప్తంగా 14 మెడికల్ కాలేజీలకు శంకుస్థాపన రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి చేశారు.  ఇందులో భాగంగా చిత్తూరు జిల్లా మదన పల్లి ఆరోగ్య వరం వద్ద రూ.475 కోట్ల వ్యయం తో 95.44 ఎకరాల విస్తీర్ణంలో అత్యాధునిక వసతు లతో నిర్మించ బోతున్నమదనపల్లి, ప్రభుత్వ మెడికల్ కాలేజి శిలాఫలకంను రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి & ఎక్సైజ్ వాణిజ్య పన్ను ల శాఖ మాత్యులు కె.నారాయణ స్వామి, రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ  మాత్యులు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, చిత్తూ రు,తిరుపతి పార్లమెంట్ స భ్యులు ఎన్. రెడ్డప్ప, గురుమూర్తి,పీలేరు,మదనపల్లి,తoబల్లపల్లి,పలమనేరు,చిత్తూరు శాసన సభ్యులు చిం తల రామ చంద్రారెడ్డి, నవాజ్ భాష,పెద్దిరెడ్డి ద్వారక నాధ్ రెడ్డి, వెంకటే గౌడ్,ఆరణి శ్రీనివాసులు, జిల్లా కలెక్టర్ యం.హరి నారాయణన్ లు ప్రారంభించారు.  

ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధా న్యత ఇస్తూ  అందుకు అనుగుణంగా చర్యలు చేపడుతోందని నవ రత్నాల ద్వారా ప్రతి ఇంటికి సంక్షేమ పథ కాల లబ్ధి చేకూరు తుందని తెలిపారు. ప్రజల ఆరోగ్యం నిమి త్తం రాష్ట్ర ముఖ్య మంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి వైద్య రంగం నకు అధిక ప్రాధా న్యత నిస్తూ నాడు- నేడు కింద ప్రభుత్వాసు పత్రిలో మౌలిక సదుపా యాలను కల్పించడం జరుగుతున్నదని తెలి పారు... అన్ని వర్గాల సంక్షేమానికి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని రైతు భరోసా, ఇన్సూరెన్స్ జలయజ్ఞం, వైఎస్ఆర్ జలకళ ఇలా పథకాల తో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ,మైనారిటీ లకు రాజకీయ సమానత్వం ఇచ్చిన ఘనత ముఖ్య మంత్రి కే దక్కుతుందని తెలిపారు... ఈ ప్రాంతం లో మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయడం  సంతోషం అన్నారు..

 రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మాత్యులు మాట్లాడు తూ రాష్ట్ర ప్రభుత్వం  రెండేళ్లు పాలనలో  లబ్ధిదారుల ఖాతాలకు సంక్షేమ పథకాల లబ్ధి ని జమ చేయడం జరిగిం దని, అభివృద్ధి సంక్షేమ మే ధ్యేయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి  సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు.. అన్ని ప్రభు త్వ పాఠశాలలను, ప్రభుత్వ ఆసుపత్రుల ను నాడు -నేడు కింద ఆధునీకరణ చేయడం జరుగుతున్నదని తెలి పారు. సన్న,చిన్న కారు రైతుల కు వై ఎస్ ఆర్ జలకళ  ద్వారా బోర్లు వేయడం జరుగు చున్నదని,సాగు,త్రాగునీటి కి ఇబ్బంది లేకుం డా చర్యలు చేపడు తున్నామని మూడు రిజర్వాయర్ ల ను ఒక సంవత్సరం లోపు పూర్తి చేసేందుకు కృత నిశ్చ యంతో ఉన్నామని తెలిపారు. మదనపల్లి, మెడికల్ కళాశాలను 95.44 ఎకరాలలో రూ. 475 కోట్లతో నిర్మించ డం ఈ ప్రాంతంలో వైద్య సేవలను పేద వారికి అందించేలా ఈ ప్రాంత ప్రజలకు ఈ ఆసుపత్రి ఒక వరమ ని,రాబోయే తరా ల కు ఈ ప్రాంతంలో పూర్తి స్థాయిలో  వైద్య సేవలు అందించేoదుకు ఉప యోగపడుతుందన్నారు.భారతదేశం లోనే ఒకే సారి 16 మెడికల్ కళాశాలకు శంకుస్థాపన చేయడం, 15 లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి కే దక్కు తుందన్నారు.. 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ నియామకం, సచివాలయం వ్యవస్థ ద్వారా పౌర సేవలు ప్రజలు ఇంటి ముంగిటకే తీసుకురావడం జరిగిం దని తెలిపారు..

 చిత్తూరు పార్లమెంటు సభ్యులు మాట్లాడుతూ దేశంలోని అన్ని రాష్ట్రా ల ముఖ్యమంత్రులకు రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదర్శప్రాయుడని, కుల, మత,పార్టీ లకు అతీతంగా సంక్షేమ పథ కాలను అమలు చేస్తూ అన్ని వర్గాల సంక్షేమా నికి కృషి చేస్తున్నారని తెలిపారు... కొన్ని దశాబ్దాలుగా ఈ ప్రాంతానికి రావాల్సిన మెడికల్ కళాశాలకు నేడు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయడం చాలా అదృష్టం అని, నిరంతరం ప్రజల సంక్షేమానికి ముఖ్య మంత్రి కృషి చేస్తున్నా రని తెలిపారు...

 తిరుపతి పార్లమెంటు సభ్యులు మాట్లాడుతూ దేశంలోనే ఆదర్శవంతం  గా రాష్ట్ర ముఖ్యమంత్రి పాలన  సాగుతోందని, దేశ చరిత్రలో ఒకేసారి 16 మెడికల్ కళాశాలకు శంకుస్థాపన చేసి ఘన త ముఖ్యమంత్రి కే దక్కు తుందన్నారు..  అత్యాధునిక పరికరాల తో వైద్య సేవలు అందిం చడం,104,108 వాహ నాలు అన్ని ప్రాంతాలకు వెళ్లి వారికి వైద్య సేవలు  వైఎస్ఆర్ అర్బన్ హెల్త్ క్లినిక్ లు ఇలా రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా మార్చుటకు రాష్ట్ర ముఖ్యమంత్రి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు..

 మదనపల్లి శాసన సభ్యులు మాట్లాడుతూ మదనపల్లిలో మెడికల్ కళాశాల మంజూరు చేయడం ఈ ప్రాంత వాసులు అదృష్టమని సుదీర్ఘ పాదయాత్రలో ముఖ్యమంత్రి ఈ ప్రాంతంలో మెడికల్ కళాశాల ను మంజూరు చేస్తానని హామీ ఇచ్చా రని ఆ హామీనినిలబెట్టు  కుంటూ మెడికల్ కళా శాల ను మంజూరు చేశారని...ఈ ప్రాంతం రానున్న కాలంలో మరింత అభివృద్ధి చెందేందుకు  కృషి చేస్తామని తెలిపారు..

 పీలేరు శాసనసభ్యులు  మాట్లాడుతూ నేడు ఒక చారిత్రాత్మక ఘట్టమని దాదాపు వంద సంవత్స రాల నుండి టీవీ వ్యాధి గ్రస్తులకు ఆరోగ్య వరం ప్రసిద్ధిగాంచిందని, మద నపల్లి ప్రభుత్వ మెడికల్ కాలేజి ద్వారా ఈ ప్రాం తంలో ఉపాధి అవ కాశాలు పెరుగు తాయని తెలిపారు

ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్ పర్సన్ రెడ్డమ్మ, జిల్లా జాయిం ట్ కలెక్టర్ (అభివృద్ధి) వి.వీర బ్రహ్మo, మదన పల్లి సబ్ కలెక్టర్ జాహ్న వి, ఎన్ ఆర్ ఈ జి ఎస్ స్టేట్ కౌన్సిల్ మెంబర్ ఎం. విశ్వ నాదం,ఏ పి ఎం ఐ డి సి ఈఈ ధనుంజయ రెడ్డి, మదనపల్లి మునిసి పల్ చైర్మన్ మనుజా, తహశీల్దార్ కుప్ప స్వామి, ఎంపీ డీఓ లీలా మాధవి, పోత బోలు సర్పంచ్ ఈశ్వ రయ్య,ఇతర ప్రజా ప్రతినిధులు, అధి కారులు పాల్గొన్నారు