ఆక్సిజన్ మిషన్లు అందించిన ఎస్బీఐ


Ens Balu
1
విశాఖ సిటీ
2021-05-31 11:36:35

విశాఖజిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ ఇచ్చిన పిలుపుతో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీల యాజమాన్యాలు కరోనా సమయంలో తమ సహాయాన్ని అందించడానికి ముందుకు వస్తున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం ఎస్బీఐ ఫౌండేషన్ ఇనాక్సిల్ టెక్నాలజీస్ కరోనా రోగులకు ఆక్సిజన్ అందించడానికి సుమారు 20 లక్షల విలువైన 5 ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్లను చెస్ట్ ఆసుపత్రికి అందజేసింది. వాటిని ఆంధ్రామెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డా.పివిసుధాకర్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో చెస్ట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ కెవివి విజయకుమార్, లింక్ కన్సల్టెన్సీ డైరెక్టర్స్ లక్ష్మీ కామేశ్వరిల పాల్గొన్నారు. 

సిఫార్సు