అప్పన్న భక్తులకు మెరుగైన సౌకర్యాలు..


Ens Balu
2
Simhachalam
2021-06-04 13:46:05

 శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు రవాణా విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసినట్టు అనువంశిక ధర్మకర్త సంచయిత గజపతి పేర్కొన్నారు. శుక్రవారం సింహాచలం కొండ దిగువన, పైన అన్ని సౌకర్యాలతో మెరుగులు దిద్దిన బస్ టికెట్ కౌంటర్ ను ఆమె ప్రారంభించారు.  ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, భక్తులకు ఆలయ వాతావరణంలో ఆహ్లాదకర వాతావరణం కల్పించేందుకు అన్ని ప్రాంతాలను ఎంతో పరిశుభ్రంగా ఉంచుతున్నామన్నారు. దీనికోసం ప్రత్యేక క్లీనింగ్ డ్రైవ్ చేపడుతున్నట్టు చెప్పారు. 
అదేవిధంగా అంతర్జాతీయ స్థాయిలో అన్నదాన సత్రం, ప్రసాదాల కౌంటర్లును కూడా ఆధునీకరించడానికి డిజైన్లను కూడా ఆహ్వానించినట్టు చెప్పారు. త్వరలోనే స్వామివారి ఆలయంలో మరిన్ని అభివ్రుద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్టు సంచయిత పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఈఓ ఎంవీ సూర్యకళ, దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు...