అప్పన్న ఆదాయం రూ.29.99 లక్షలు..
Ens Balu
2
Simhachalam
2021-06-04 13:55:35
విశాఖలోని సింహాచలం శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయంలో శుక్రవారం నిర్వహించిన మూడు హుండీల లెక్కింపులో రూ.29లక్షల 99వేల 975 రూపాయాలు ఆదాయం సమకూరినట్టు ఈఓ ఎంవీసూర్య కళ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, కరోనా నేపథ్యంలో అన్ని నిబంధనలు అమలు చేసి ఆలయ సిబ్బందితోనే పరకామణిలో హుండీ లెక్కింపు చేపట్టి నట్టు చెప్పారు. హుండీలో నగదుతోపాటు 10 కతార్ రియాల్స్, ఒక యుఎస్ డాలర్, రెండు సామ్లు, రెండు గ్రాముల బంగారం కూడా లభించినట్టు చెప్పారు. ఈ కార్యక్రమం ట్రస్టు సభ్యుల సమక్షంలో ఈఓ పర్యవేక్షణలో నిర్వహించారు. దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు.