ఫిషింగ్ హార్బర్ల కోసం ప్రత్యేక పరిశీలిన..


Ens Balu
3
Pusapatirega
2021-06-04 15:08:53

విజయనగరం జిల్లాలో  ఫిషింగ్ హార్బర్ నిర్మాణం, ఫిష్ ల్యాండ్ లకు అనువైన ప్రదేశాల ఎంపికపై సాధ్యాసాధ్యాలను చెన్నై నుంచి వచ్చిన బ్రుందంతో కలిసి పూసపాటి రేగ మండలంలో పరిశీలించినట్టు మత్స్యశాఖ ఉప సంచాలకులు ఎన్.నిర్మల కుమారి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం మండలంలోని చింతపల్లిలో ఆమె బ్రుందంతో కలిసి పర్యటించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రప్రభుత్వం ఏడు ప్రాంతాల్లో ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండ్ లను నిర్మించ తలపెట్టిందని, అందులో భాగంగా జిల్లాలో నిర్మించ తలపెట్టిన ఫిషింగ్ హార్బర్ కోసం ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ కి చెందిన నిపుణులతో  అక్కడి ప్రాంతాలను పరిశీలించామన్నారు. అంతేకాకుండా మత్స్యకారుల ద్వారా ఈ ప్రాంతం యొక్క బౌగోళిక పరిస్థితులు, తుఫానులు వచ్చినపుడు సంభవించే పరిస్థితులు, ఇతరత్రా అంశాలను చర్చించి స్వయంగా  బ్రుందంతో కాలిపి పరిశలించామన్నారు. పైగా ఏ ప్రాంతంలో అయితే హార్బర్ కి అనువుగా వుంటుందనే కోణంలో కొన్ని అంశాలపై స్థానిక మత్స్యకారులతో కూడా మాట్లాడినట్టు చెప్పారు. ఓడరేవులకు మార్గాలు, తీరాలకు జాతీయ స్థాయిలో సాంకేతికతకు సంబంధించిన అంశాలు కూడా ప్రత్యేక బ్రుందంతో చర్చించామన్నారు. ఇక్కడి ప్రాంతాల పరిశీలన అనంతరం ఫిష్ ల్యాండ్ కి సంబందిచిన విషయాన్ని ప్రభుత్వానికి చెన్నై బ్రుందం నివేదిక ఇస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ సహాయ సంచాలకులు కిరణ్ కుమార్,  అభివ్రుద్ధి అధికారిణి చాందిని, గ్రామ మత్స్యశాఖ సహాయకులు, మత్సకార మిత్రాలు, మత్స్యకార సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.