శ్రీ కనక మహా లక్ష్మీ అమ్మవారి పవిత్ర సమర్పణ..


Ens Balu
4
బురుజుపేట
2020-08-30 19:07:43

విశాఖ బురుజుపేటలోని శ్రీ కనకమహాలక్ష్మీ అమ్మవారి దేవస్థానంలో పవిత్రోత్సవములు ఘనంగా జరగుతున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం అమ్మవారికి విశ్వక్సే నారాధనము, పుణ్యాహవచనము, పవిత్ర అభిమన్త్రణము, అగ్నిధ్యానములు, ఉక్తహోమము, అష్టకళాశారాధనము,  అమ్మవారికి విశేష ఆరాధనము, అష్టకలశస్న పనము, పవిత్ర సమర్పణము, నీరాజనం, మంత్రపుష్పములు అర్పించారు. అదేవిధంగా సాయంత్రం అగ్నిధ్యానములు, ఉక్త హోమములు, నీరాజన మంత్రపుష్ప ములు సమర్పించారు. ఈ కార్యక్రమములో ఉపకలక్టర్ , కార్యనిర్వాహణాధికారిణి   యస్. జె. మాధవి పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వ నిబంధనల మేరకు సామాజిక దూరం పాటిస్తూ, అమ్మవారికి ఏకాంతంగానే పవిత్రోత్సవములు నిర్వహిస్తున్నట్టు చెప్పారు.  సహాయ కార్యనిర్వాహణాధికారి  వి. రాంబాబు, వి.బి.వి. రమణమూర్తి, పర్యవేక్షకులు,  ఎన్.వి.వి.ఎస్.ఎస్.ఏ.ఎన్. రాజు, & ఆలయ వేదపండితులు, అర్చకులు కార్యక్రమంలో పాల్గొన్నారు.