ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటండి.. పర్యావరణాన్ని కాపాడండి..


Ens Balu
2
Simhachalam
2021-06-05 03:39:30

ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటి వాతావరణ కాలుష్యాన్ని తగ్గించి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని  శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామివారి దేవస్థానం ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, విజెఎఫ్ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు  పిలుపునిచ్చారు. శనివారం అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని దేవస్థానం పరిధిలోని గోశాల వద్ద సహచర సభ్యులతో కలిపి మొక్కలను నాటారు. ఈ సందర్భంగా గంట్ల మాట్లాడుతూ, ప్రతీ ఒక్కరూ తమ ఇంటి ఆవరణలోనే  మొక్కలను నాటాలన్నారు. చిన్న పిల్లలకు ఇప్పటి నుంచే మొక్కలు నాటడం ఆలవాటు చేస్తే వారి తరం వచ్చేసరికి పచ్చదనం పరిఢవిల్లుతుందన్నారు. ముఖ్యంగా ఫలసాయాలు, పచ్చదనం ఇచ్చే మొక్కలు నాటడం ద్వారా అవి భావి తరాల వారికి ఎంతో బాగ ఉపయోగపడతాయన్నారు.  ఈ కార్యక్రమంలో దేవస్థాన సిబ్బంది కూడా పాల్గొని మొక్కలు నాటారు.
సిఫార్సు