శ్రీవివేకానంద సంస్థకు గంట్ల విరాళం రూ.75వేలు..


Ens Balu
3
Visakhapatnam
2021-06-07 08:45:48

మహా విశాఖ నగరంలోన పలువురు అనాథ, వృద్ధులకు శ్రీ వివేకానంద స్వచ్చంద సేవా సంస్థ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులు,జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, వైజాగ్ జర్నలిస్ట్ ల  ఫోరమ్ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు కొనియాడారు. సోమవారం ఈ మేరకు శ్రీనుబాబు వివేకానంద స్వచ్ఛంద సంస్థకు తన సొంత నిధులు రూ.75 వేల విరాళాన్ని అందజేశారు. ఆ సందర్భంగా గంట్ల మాట్లాడుతూ, ఈ నిధులను అన్నప్రసాదానికి వినియోగించాలని సంస్థ అధ్యక్షుడు సూరాడ అప్పారావును కోరారు. అనంతరం  నిరుపేదలకు అన్నదానం, వస్త్రదానం నిర్వహించారు. అంతేకాకుండా  అనాధలు, వృద్ధులు సేవలో కొనసాగుతున్న సంస్థ మహిళా సభ్యులుకు పలు నిత్యావసరాలను కూడా అందజేశారు. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో తన పరిధిలో సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. గత ఏడాది కరోనా ప్రారంభం నుంచి నేటి వరకూ కూడా దశలవారీగా తన సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నట్లు ఆయన వివరించారు. పలువురు జర్నలిస్టు మిత్రులతో పాటు, స్వచ్ఛంద సంస్థలు,
నిరుపేదలకు తన వంతు, సేవలు అందిస్తున్నట్లు చెప్పారు.. ప్రతియేటా వివేకానంద స్వచ్ఛంద సంస్థకు లక్షకు మించి విరాళం అందజేస్తున్నట్టు చెప్పారు. వీటితో పాటు పాపా హోమ్, ప్రేమ సమాజం మనసు, స్వచ్ఛంద సంస్థలకు కూడా దశల వారీగా తన వంతు సహాయం అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు అప్పారావు సంస్థ సభ్యులు సోంబాబు,ఇతర మహిళా ప్రతినిధులు పాల్గొన్నారు.