రూ.1.30 కోట్ల ఎక్స్ గ్రేషియా చెల్లింపు..


Ens Balu
2
Collector Office
2021-06-07 13:26:05

విశాఖ  జిల్లాలో కోవిడ్-19 వలన మరణించిన వారి పిల్లలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియాన్ని విశాఖ జిల్లాలో 13 మంది పిల్లలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున రూ. ఒక కోటి  30 లక్షలు అందజేసినట్లు జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ తెలిపారు.  జిల్లాలో మొత్తం 13 మంది అనాధ పిల్లలను గుర్తించి వారికి ఎక్స్ గ్రేషియా చెల్లించడం జరిగిందన్నారు వీరు, (1) మీసాల శ్రావణి (గాజువాక); (2) రెడ్డి భాగ్యశ్రీ, (సబ్బవరం); (3) పాంగి విష్ణు,(4) పాంగి జగన్ (పాడేరు), (5) పెర్ల మనోహర్ (విశాఖ మహరాణిపేట), (6) మీసాల ప్రసీద(కంచరపాలెం, గోపాలపట్నం), (7) చదరం బాల సాయి లక్ష్మీ(పెందుర్తి); (8) బుద్ధ ఉషశ్రీ, (9)బుద్ధ ప్రజ్వల్ కుమార్ (సీతమ్మధార, విశాఖపట్నం), (10) జెర్సింగి సందీప్  (పెదబయలు); (11) మంత్రి కౌషిక్ సూర్యప్రకాష్ (అనకాపల్లి), (12) కాండ్రకోట శ్రీచందన (13)కాండ్రకోట శ్రీమిధున్(అనకాపల్లి), పిల్లలకు రూ.10 లక్షల చొప్పున బ్యాంకులో డిపాజిట్ చేయడం జరిగిందన్నారు.  సదరు మొత్తాన్ని ఈ పిల్లలకు 25 సంవత్సరముల వయస్సు వచ్చిన తరువాత వారికి ఇస్తారని,  అంత వరకూ ఈ సొమ్ము పై వచ్చే వడ్డీ వీరి పోషణకు వినియోగించడం జరుగుతుందని తెలిపారు.