మ్రుతుల కుటుంబాలకు ఆర్ధికసాయం..


Ens Balu
1
Guntur
2021-06-07 15:49:01

కరోనా వైరస్ , రోడ్డు  ప్రమాదాలకు గురై మ్రుతిచెందిన ఇద్దరు రెవెన్యూ ఉద్యోగుల కుటుంబాలకు రూ. 2.50 లక్షల ఆర్ధిక సయాహాన్ని జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ అందించారు.   సోమవారం కలక్టరేట్ లోని జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో  జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్, సంయుక్త కలెక్టర్ ( రైతు భరోసా, రెవెన్యూ ) ఏ.ఎస్. దినేష్ కుమార్  లు  బాధిత కుటుంబాలకు ఆర్ధిక సాయం క్రింద రూ. 2.50  లక్షల చెక్కులను అందించారు. ఏప్రిల్ 22 న గురజాల రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా పని చేస్తున్న కే. శ్రీనివాసరావు కోవిడ్ కు గురై  చికిత్స పొందుతూ మృతి చెందారు.  మాచవరం మండలం  రెవెన్యూ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న షేక్.బాజీ మే 8 న రోడ్డు  ప్రమాదంలో మృతి చెందారు.  మృతుల కుటుంబాలను ఆదుకునే క్రమంలో గుంటూరు జిల్లా రెవెన్యూ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఒక్కొక్క కుటుంబానికి రూ. 2.50 లక్షల చొప్పున  జిల్లా కలెక్టర్, సంయుక్త కలెక్టర్  చేతుల మీదుగా ఆర్ధిక సాయం క్రింద చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ ( సచివాలయాలు, అభివృద్ది ) పి. ప్రశాంతి, సంయుక్త కలెక్టర్ ( హౌసింగ్ ) అనుపమ అంజలి, నరసారావుపేట సబ్ కలెక్టర్ శ్రీవాస్ నుపూర్ అజయ్ కుమార్, ట్రైనీ సహాయ కలెక్టర్  శుభం భన్సాల్, జిల్లా రెవెన్యూ అధికారి పి. కొండయ్య, కలక్టరేట్ ఏ.ఓ సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.