డయల్ యువర్ కమిషనర్ కి 30 ఫిర్యాదులు


Ens Balu
4
Tirupati
2020-08-31 14:01:06

 తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో వైఎస్ఆర్ సమావేశ మందిరంలో నిర్వహించిన స్పందన డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమానికి 30 ఫిర్యాదులు అందాయని కమిషనర్ గిరీష తెలియజేశారు. ఈ మేరకు సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, చాలా వరకూ ప్రజలు వారి యొక్క కాలనీల సమస్యలు, వ్యక్తిగత సమస్యలతోపాటు అన్ని రకాల సమస్యలు ఈ కార్యక్రమంలో విన్నవించారన్నారు. వాటన్నింటినీ సంబంధిత అధికారులకు బదిలీ చేసి వారం రోజుల్లోగా పరిష్కరించాలని ఆదేశించామన్నారు. ప్రతీవారం ఈ కార్యక్రమం నిర్వహించడం ద్వారా ప్రజలు నేరుగా అధికారులకు తమ సమస్యలు చెప్పడానికి అవకాశం వుంటుందన్నారు. డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమంలో అదనపు కమిషనర్ హరిత, ఉప కమిషనర్ చంద్రమౌళీశ్వర రెడ్డి, మేనేజర్ హసిమ్, డిప్యూటీ అసిస్టెంట్ సిటీ ప్లానర్ దేవి కుమారి, అసిస్టెంట్ సిటీ ప్లానర్ శ్రీనివాసులు, షణ్ముగం, రెవెన్యూ ఆఫీసర్లు సేతు మాధవ్, సుధాకర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు రవీందర్ రెడ్డి, రఘు కుమార్, విజయ్ కుమార్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, శ్రీధర్, దేవిక, గోమతి, రీజినల్ ఫైర్ ఆఫీసర్ జ్ఞాన సుందర్,    డివైఈవో జనార్దన్ రెడ్డి, శానిటరీ సూపర్వైజర్లు గోవర్ధన్, చెంచయ్య తదితరులు పాల్గొన్నారు.
సిఫార్సు