చీని, నిమ్మ సంవత్సరంగా 2021-22..


Ens Balu
3
Kakinada
2021-06-08 15:01:22

చీని, నిమ్మ సంవత్సరంగా ఈ  ఏడాది (2021-22) ని ప్రకటిస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ,  సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. మంగళవారం డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వ విద్యాలయం సిట్రస్ పంటల విస్తరణ అంశంపై నిర్వహించిన జూమ్ కాన్ఫెరెన్స్ లో  మంత్రి  తమ క్యాంపు కార్యాలయం నుండి పాల్గొన్నారు.  ఈ సందర్భంగా కురసాల మాట్లాడుతూ రైతులకు రెట్టింపు ఆదాయం చేకూర్చడమే  కాకుకండా, గ్రామాల్లో ఉపాధి, జీవన ప్రమాణాలు పెంపొందించే నిమ్మ , బత్తాయి (చీని ) పంటల సాగుకు ప్రాధాన్యం కల్పిస్తూ ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి దేశానిర్దేశం చేశారన్నారు. తదనుగుణంగా బత్తాయి, నిమ్మ పంటల సాగు, దిగుబడి, ఎగుమతులకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చేందుకు ఈ  ఏడాదిని "నిమ్మ, బత్తాయి సంవత్సరంగా" ప్రకటించాలని నిర్ణయించామని మంత్రి కన్నబాబు తెలిపారు. మంచి లాభదాయకమైన ఉత్పత్తుల సాధనకు ధృవీకరించిన నాణ్యమైన మొక్కలు, అంట్లను రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చేలా ఉద్యాన శాస్త్రవేత్తలు, ఉద్యాన శాఖ సమన్వయంతో కృషి చేయాలని ఆయన కోరారు. అలాగే శాస్త్రీయ పరమైన యాజమాన్య, సాగు పద్దతులపై రైతులకు అవగాహనా పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు.  ఆర్ బి కె ల ద్వారా నిమ్మ మరియు బత్తాయి సాగు శిక్షణ , సమగ్ర యాజమాన్య పద్దతుల పై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు.  సిట్రస్ జాతి పండ్ల ఉత్పత్తిలో మన రాష్టం దేశంలోనే అగ్ర స్థానంలో వుందని, మన రాష్ట్ర బత్తాయి , నిమ్మ పండ్ల దేశీయ రకాలకు జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో  మరింత ప్రాచుర్యం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. నిమ్మ, బత్తాయి జాతి కాయలు, పండ్లు రోగ నిరోధక శక్తిని ఎంతగానో పెంచుతాయని, వాటిని ప్రజలకు మరింతగా అందుబాటులోకి తెచ్చి స్థానిక వినియోగాన్ని పెంచాలని కోరారు.  సిట్రస్ పంటల విస్తరణ ప్రణాళికలపై పలువురు శాస్త్రవేత్తలు, ఉన్నతాధికారులు, నిమ్మ,బత్తాయి సాగు చేస్తున్న రైతులతో మంత్రి కన్నబాబు సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ఈ సమావేశంలో వసాయ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి పూనమ్ మాలకొండయ్య , డాక్టర్ వై ఎస్ ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉప కులపతి ప్రొఫెసర్ జానకి రామ్ , ఉద్యాన శాఖ కమిషనర్ శ్రీధర్ మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.