డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమానికి 24 ఫిర్యాదులు
Ens Balu
4
జివిఎంసి
2020-08-31 17:49:49
విశాఖలోని జి.వి.ఎం.సి. ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమానికి 24 ఫిర్యాదులు వచ్చాయని జి.వి.ఎం.సి. కమీషనర్ డా. జి. సృజన చెప్పారు. సోమవారం జివిఎంసిలోని టోల్ ఫ్రీ నం. 1800-4250-0009 ద్వారా ప్రజల నుంచి కమిషనర్ వినతులు స్వీకరించారు. వాటిని శాఖల ఆధారంగా అధికారులకు బదలాయించిన ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులను స్వయంగా పరిష్కరించి నివేదికలు అందజేయాలని అధికారులను/జోనల్ కమిషనర్లను ఆదే శించారు. ఇందులో 1వ జోనుకు సంబందించి 03 ఫిర్యాదులు, 2వ జోనుకు సంబందించి 02, 3వ జోనుకు సంబందించి 05, 4వ జోనుకు సంబందించి 03, 5వ జోనుకు సంబందించి 07, 6వ జోనుకు సంబందించి 02, పి.డి. (యు.సి.డి) సంబందించి 01, సి.ఇ. నకు సంబందించి 01, మొత్తము 24 ఫిర్యాదులు ఫోను ద్వారా స్వీకరించారు. ఈ ఫిర్యాదులను పరిశీలించిన కమీషనర్ డా. జి. సృజన ప్రధాన కార్యాలయ విభాగపు ఉన్నతాధికారులతోను, జోనల్ కమిషనర్లతోను మాట్లాడుతూ, డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమంలో స్వీకరించిన ఫిర్యాదులు 03రోజులలో పరిష్కరించాలని అధికారులను కోరారు. ఒక సమస్య పదే పదే ఫిర్యాదు వస్తే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని కూడా కమిషనర్ హెచ్చరించారు. ప్రజా సమస్యలకు తగు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.