అప్పన్నకు రూ.1,00,116 విరాళం..


Ens Balu
1
Simhachalam
2021-06-12 15:29:53

విశాఖలోని సింహాచలం శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి నిత్యన్నదాన పథకానికి విశాఖ  సీతమ్మధారకు చెందిన  దంపతులు  ఎస్వీఎస్ఎల్ఎన్  శాస్త్రి - ప్రభావతి  శనివారం రూ.1,00,116 విరాళం ఇచ్చారు. ఈ మొత్తాన్ని ఈఓ సూర్యకళకి దాతలు అందించారు.  తమ వివాహ వార్షికోత్సవం సందర్భంగా  జూన్ 12న అన్నదానం చేయాలని కోరారు. ఆ చెక్కుని ఆలయ ఈఓ ఎంవీసూర్యకలకు సమర్పించారు. అనంతరం సింహాద్రి అప్పన్నను దర్శించుకొని పూజలు చేసి అనంతరం కప్పస్థంబాన్ని ఆలింగనం చేసుకున్నారు. ఈ సందర్భంగా దాతలు మాట్లాడుతూ, స్వామివారిని దర్శించుకోవడానికి ఎంతో దూరం నుంచి భక్తులు వస్తుంటారని అలాంటి వారికి ఒక్కపూటైనా తమవంతుగా భోజనం పెట్టాలనే ఉద్దేశ్యంతోనే ఈ మొత్తాన్ని నిత్యన్నాధాన పథకానికి సమర్పిస్తున్నామన్నారు. ఆలయ అధికారులకు దాతలకు ప్రసాదాలు అందించారు. కార్యక్రమంలో దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు.