కరోనాకి సెప్టెంబరు నెల చాలా కీలకం..కలెక్టర్
Ens Balu
3
కలెక్టరేట్
2020-08-31 19:02:08
కోవిడ్ వైరస్ కేసులు పెరగడానికి సెప్టెంబరు నెల కీలకమని ఈవిషయంలో అధికారులు చాలా అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లాలోని కోవిడ్ ఆసుపత్రుల నోడల్ అధికారులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కోవిడ్ ఆసుపత్రులలో రోగులకు అందుతున్న సేవల పై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కోవిడ్ ఆసుపత్రులు గా గుర్తించబడిన ప్రైవేటు ఆసుపత్రుల్లో మానవ వనరుల కొరత అధిగమించడానికి రాష్ట్ర ప్రభుత్వం తన నిధులతో డాక్టర్లు, నర్సులు, హెల్ప్ డెస్క్ మేనేజర్లు, ఇతర సిబ్బందిని రిక్రూట్ చేసిందని తెలిపారు. వారి అటెండెన్స్ ను నోడల్ అధికారు లు ధృవీకరించాలని, అప్పుడే జీతభత్యాలు చెల్లించగలమని తెలిపారు. ప్రతి ఆసుపత్రి లో హెల్ప్ డెస్క్ ను నిర్దిష్ట ప్రమాణాల మేరకు నిర్వహిణ జరగాలన్నారు. అడ్మిషన్లు, డిస్చార్జిల డేటా, ఖాళీ గా ఉన్న బెడ్ల వివరాలు ఎప్పటికప్పుడు మాతా, శిశు సంరక్షణ పోర్టల్ లో అప్ లోడ్ చేయాలని, ఆసుపత్రిలో డిస్ ప్లే బోర్డు లపై ప్రదర్శించాలన్నారు.
ప్రతీ ఆసుపత్రిలోనూ 2 ల్యాండ్ లైన్ టెలిఫోన్ లు ఏర్పాటు చేసుకోవాలని, ఒక ఫోన్ తో ఆసుపత్రి వార్డుల్లోని సిబ్బందితో సంప్రదించి, రోగి బంధువులకు సరియైన సమాచారాన్ని అందించాలని, ఇంకొక టెలిఫోన్ ద్వారా బయటి నుండి వచ్చే కాల్స్ కు సమాధానమిచ్చి, వివరాలను రిజిస్టర్ లో నమోదు చేయించాలని కోరారు. కోవిడ్ ఆసుపత్రులను జాయింట్ కలెక్టర్ గోవింద రావు ఆసుపత్రులను తనిఖీ చేయాలని, ప్రతిరోజూ టెలికాన్ఫరెన్సు నిర్వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ గోవింద రావు, డిఆర్ఓ ఎ.ప్రసాద్, ఆంధ్రా మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ సుధాకర్, అడిషనల్ డిఎంహెచ్ఓ విజయలక్ష్మి, ఆరోగ్య శ్రీ జిల్లా కోఆర్డినేటర్ భాస్కరరావు, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.