స్పందనకు 114 ఫిర్యాదులు
Ens Balu
2
కలెక్టరేట్
2020-08-31 19:42:07
శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన స్పందన కార్యక్రమానికి 114 మంది ఫోన్ కాలర్స్ ఫోన్ చేసి తమ వినతులు వచ్చినట్టు జిల్లా రెవిన్యూ అధికారి బి.దయా నిధి తెలియజేశారు. ఇందులో రెవిన్యూ శాఖవి 24 కాగా, పౌర సరఫరాల సంస్థవి 11, ఇతర శాఖలకు సంబంధించి 79 వినతులు ఉన్నాయన్నారు. సోమవారం ఉద యం కలెక్టర్ కార్యాలయంలోని స్పందన విభాగంలో స్పందన కార్యక్రమం జరిగింది. కరోనా నేపధ్యంలో ఫోన్ లేదా ఇ-మెయిల్ ద్వారా ప్రజల నుండి వినతులు ( డయల్ యువర్ కలెక్టర్, స్పందనకు బదులుగా ) స్వీకరిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా 114 మంది తమ ఫిర్యాదులను జిల్లా రెవిన్యూ అధికారికి తెలిపి నట్లు ఆయన చెప్పారు. వచ్చిన ఫిర్యాదులన్నింటినీ ఎప్పటికపుడు సంబంధిత అధికారులకు పంపి చర్యలు చేపట్టడం జరుగుతుందని ఆయన స్పష్టం చేసారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కార్యాలయం హెచ్ సెక్షన్ సూపరింటెండెంట్ అప్పారావు, స్పందన విభాగం భాస్కరరావు , సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.