ఘనంగా పైడితల్లి అమ్మవారి పండుగ..


Ens Balu
3
Simhachalam
2021-06-15 14:33:03

విశాఖలోని సింహాచలం దేవస్థానం ఉపాలయమైన గ్రామ దేవత శ్రీ పైడితల్లి అమ్మవారి పండుగ మంగళవారం ఘనంగా జరిగింది.  ఉదయాన్నే శ్రీఅమ్మవారి ఆరాధనలు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి మహానివేదన సమర్పించారు. అనంతరం భక్తుల సందర్శనార్ధం ఆలయం తలుపులు తీసి భక్తులకు దర్శనాలు కల్పించారు. కరోనా నేపథ్యంలో ముందుగానే దేవస్థాన ఈఓ ఎంవీ సూర్యకళ ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో భక్తులు అమ్మవారిని దర్శించుకొని పసుపు, కుంకుమలు సమర్పించుకున్నారు. సాయంత్రం మరోసారి అమ్మవారి దీపారాదన చేపట్టి నివేదన చేశారు.