నెలాఖరుకి ఇళ్ల నిర్మాణాలు ప్రారంభం..


Ens Balu
3
Vizianagaram
2021-06-16 12:37:47

పేద లందరికి ఇళ్లు క్రింద మొదటి  విడత లో మంజూరు చేసిన గృహాలన్ని ఈ నెలాఖరు నాటికి గ్రౌండింగ్ పూర్తి కావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి తెలిపారు.   అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుండి బుధవారం  వీడియో కాన్ఫరెన్స్ ద్వారా  సమీక్ష నిర్వహించారు. కోవిడ్-19, ఎన్ఆర్ఈజిఎస్ పనులు, గ్రామ సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాల భవనాలు, డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లు,  ఏఎంసియుఎస్ & బిఎంసియుఎస్, అంగన్వాడి సెంటర్స్, వై.ఎస్.ఆర్ అర్బన్ క్లినిక్ లు, నవరత్నాలు - పేదలందరికీ ఇళ్లు పురోగతి, ఖరీఫ్ సీజన్ సన్నద్ధత తదితర అంశాలపై   ముఖ్యమంత్రి సమీక్షించారు.  ఈ సందర్బంగా మాట్లాడుతూ ఆప్షన్ 3 ను ఎంచుకున్న లబ్ధిదారుల కోసం కాంట్రాక్టర్ లతో మాట్లాడి బృందాలుగా ఏర్పాటు చేసుకోవాలన్నారు. నియోజక వర్గాల ప్రజా ప్రతినిధులతో మాట్లాడి గృహ నిర్మాణాల్లో సమస్యలు ఉంటే పరిష్కరించుకుంటు ముందుకు వెళ్లాలన్నారు. 3వ దశ కోవిడ్ వస్తుందో రాదో ఖచ్చితంగా చెప్పలేము కానీ, అందుకోసం పూర్తి స్థాయి సన్నద్ధంగా ఉండాలని సూచించారు.  ప్రస్తుతం కేసు లు తగ్గుతున్నాయి కదా అని నిర్లక్ష్యం పనికిరాదని, కోవిడ్ ప్రోటోకాల్ ను పాటిస్తూనే ఉండాలని స్పష్టం చేశారు. రైతుకు మేలు జరగాలంటే ఈ- క్రాప్ బుకింగ్  సమర్ధవంతంగా జరగాలన్నారు. ఉపాధి హామీ నిధులతో చేపడుతున్న పనులు వేగంగా జరగాలన్నారు.  ప్రతి జిల్లాలో కనీసం 2 వేల  కిలో మీటర్ల పరిధి లో అవెన్యూ, ఇన్స్టిట్యూషనల్ ప్లాంటేషన్  జరగాలన్నారు. జగనన్న భూ హక్కు-భూ రక్ష  క్రింద సర్వే కార్యక్రమాన్ని ప్రారంభించాలని సూచించారు. 
 కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో జిల్లా  కలెక్టర్ ఎం. హరి జవహర్ లాల్,  జాయింట్ కలెక్టర్లు   డాక్టర్  జి.సి కిషోర్ కుమార్,  డా.మహేష్ కుమార్,  మయూర్ అశోక్,   జె.వెంకట రావు జిల్లా  రెవిన్యూ అధికారి గణపతి రావు, జిల్లా  అధికారులు పాల్గొన్నారు.