పెండింగ్ బిల్లులు చెల్లింపు జరగాలి..


Ens Balu
4
Collector Office
2021-06-17 13:45:43

ఇండియన్ నేవి  రాంబిల్లిలో  చేపట్టిన  ఎన్ ఎ ఒ బి  ప్రాజెక్టు లో అర్హులైన  నిర్వాసితులకు, ప్రభావితులకు పెండింగ్ లో ఉన్న చెల్లింపులను సత్వరమే పూర్తి చేయాలని  జాయింట్ కలెక్టర్  ఎం .వేణుగోపాల రెడ్డి తెలిపారు.  గురువారం  స్థానిక  కలెక్టరేట్ సమావేశమందిరంలో  నేవి, రెవెన్యూ, ఇరిగేషన్, మత్స్యశాఖ అధికారులతో  సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా  ఆయన  మాట్లాడుతూ  ఎన్ ఎ ఒ బి  ప్రాజెక్టుకు సంబంధించి  అపరిష్కృతంగా  ఉన్న అన్ని సమస్యలపై  సంబందిత అధికారులు  క్షేత్రస్థాయిలో  తనిఖీ చేసి  తక్షణమే నివేదికను సమర్పించాలని  ఆదేశించారు. గతంలో  ప్రభుత్వం ప్రకటించిన మేరకు  అర్హులైన  లబ్దిదారులెవరికైనా  చెల్లింపులు  పెండింగ్ లో ఉంటే  సత్వరమే  పరిష్కరించాలని  కోరారు.  ఈ కార్యక్రమంలో  నేవి అధికారులు కెప్టెన్ ఆదినారాయణ, కెప్టెన్  టి.రాజశేఖర్,  కెప్టెన్ ఎస్. శివకుమార్,  ఆర్ డి ఓ లు సీతారామరావు, అనిత,  ఇరిగేషన్ ఎస్ ఇ సూర్యకుమార్,  ఎన్ ఎ ఒ బి , ఎస్ డి సి  జోసెఫ్, , మత్స్యశాఖ జెడి లక్ష్మణరావు,  రాంబిల్లి,  ఎస్.రాయవరం మండలాల  తహసిల్దార్లు, ఇతర  అధికారులు పాల్గొన్నారు.