మత్తు పదార్ధాల నిర్మూలనే లక్ష్యం..


Ens Balu
4
Tirupati
2021-06-18 14:15:32

తిరుపతి నగరంలో గంజాయి లాంటి మత్తు పదార్థాల వాడకాన్ని నిర్ములించడమే లక్ష్యంగా చర్యలు చేపట్టామని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి అన్నారు. రుపతిలో శుక్రవారం సాయంత్రం ఆయన భవాని నగర్, సప్తగిరి నగర్, అన్నారావు సర్కిల్, కేటీ రోడ్డు, గలివీధి, చిన్నబజారు వీధి, గాంధీ రోడ్డు, బండ్ల వీధి, తాతయ్య గుంట ప్రాంతాల్లో ఆయన కాలినడకన పర్యటించారు. ఈ సందర్భంగా భూమన మాట్లాడుతూ, ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా , ఎన్ని శక్తులు అడ్డు తగిలినా ఉక్కుపాదంతో తొక్కేస్తామని హెచ్చరించారు. ఎవరైనా గంజాయి సేవిస్తున్నట్టు, లేదా బెదిరిస్తున్నట్టు తన సెల్ ఫోన్ కి కాల్ చేస్తే తగు విధంగా స్పందించి, చర్యలు చేపడతామని స్పష్టం చేశారు.  తి
 కొంత మంది యువకులు మత్తుకు బానిసలుగా మారుతున్నారని ఆవేదన చెందారు. ఇలాంటి ఇప్పటికైనా ఇలాంటి యువకులు, చైతన్య వంతులు కావాలన్నారు.  మత్తు పదార్థాల నిర్ములన  కోసం పోలీసు యంత్రాంగం చేపడుతున్న చర్యలు భేషుగ్గా ఉన్నాయని, పోలీసు యంత్రంగం  పనితీరును  ప్రశంసించారు. స్థానికులు కూడా సహకరించాలని పిలుపునిచ్చారు. మత్తు పదార్థాలను విక్రయించే వారిపై నిఘా ఉంచి, విక్రయాల లింక్ ను తుంచి వేస్తామన్నారు. మత్తును అంతముందించే వరకు వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు.  గంజాయి స్థావరాలను గుర్తించి, వారి భరతం పట్టేందుకు భూమన నిత్యం నగరంలో కాలినడన .. పర్యటిస్తూ, మత్తు రాయుళ్ల గుండెల్లో దడ పుట్టిస్తున్నారు.