సింహాద్రి నాధునికి స్పీకర్ పూజలు..


Ens Balu
3
Simhachalam
2021-06-18 14:22:00

విశాఖలోని సింహాచలం శ్రీశ్రీ శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి వారిని శాసన సభాపతి తమ్మినేని సీతారాం కుటుంబ సమేతంగా శుక్రవారం దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ ఈఓ ఎంవీ సూర్యకళ స్వామి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం స్పీకర్ కుటుంబం స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.  ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, కరోనా వైరస్ ను రూపుమాసిపోయి ప్రజలు సాధారణ పరిస్థితి వచ్చేలా దీవించాలంటూ స్వామిని వేడుకున్నట్టు చెప్పారు. అంతేకాకుండా స్వామివారి ఆలయ అభివ్రుద్ధికి తనవంతు క్రుషి చేస్తానని హామీఇచ్చారు. అంతకు ముందు దేవాలయ అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వచనాన్ని అందించారు.  ఈఓ స్పీకర్ కుటుంబానికి ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన ట్రస్టుబోర్టు సభ్యులు, సూరిబాబు, దినేష్ రాజులు పాల్గొన్నారు.