విశాఖలోని సింహాచలం శ్రీశ్రీ శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి వారికి విశాఖకు చెందిన బాపూజీ నగర్ దంపతులు ప్రభాకర్ రెడ్డి , విజయలక్ష్మి లక్ష రూపాయల విరాళం ఇచ్చారు. శుక్రవారం ఆలయం వెలుపల ఈఓ ఎంవీ సూర్యకళకు ఆ మొత్తానికి సంబంధించిన చెక్కును అందజేశారు. తమ వివాహ వార్షికోత్సవం సందర్భంగా స్వామివారికి ఈ మొత్తాన్ని విరాళంగా సమర్పించినట్టు దాతలు తెలియజేశారు. అనంతరం స్వామివారిని దర్శించుకొని తీర్ధ ప్రసాదాలను తీసుకోవడంతో పాటు వేద పండితుల ఆశీర్వచనాన్ని కూడా అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.