ఫీవర్ సర్వే పక్కాగా నిర్వహించాలి..


Ens Balu
5
Anantapur
2021-06-18 14:27:45

కరోనా నేపథ్యంలో గ్రామాల్లో ఫీవర్ సర్వే పక్కాగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ ఆదేశించారు. గ్రామాల్లో కరోనా నేపథ్యంలో చేపడుతున్న ఫీవర్ సర్వే ని ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు ఇంటింటికి వెళ్లి పరిశీలించాలన్నారు. ఫీవర్ సర్వేని జాగ్రత్తగా చేపట్టాలని, ఫీవర్ సర్వే లో జ్వరం, దగ్గు, జలుబు తదితర లక్షణాలు ఉన్న వారి జాబితాను జాగ్రత్తగా పరిశీలించాలని ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలను ఆదేశించారు. గ్రామాల్లో శానిటేషన్ ప్రక్రియను నిరంతరం జరిగేలా చూడాలని శానిటేషన్ సెక్రటరీలకు జిల్లా కలెక్టర్ సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) ఏ.సిరి, జాయింట్ కలెక్టర్ (ఆసరా) గంగాధర్ గౌడ్, అసిస్టెంట్ కలెక్టర్ సూర్య తేజ, డిపిఓ పార్వతి, జిల్లా ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ కల్యాణి, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.