క్లాప్ తో క్లీన్ అనంతగా మారిపోవాలి..


Ens Balu
3
Anantapur
2021-06-18 14:34:05

క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో అనంత నగరపాలక సంస్థ కూడా క్లీన్ గా మారిపోవాలని నగర మేయర్ వసీం సలీమ్ అన్నారు. శుక్రవారం క్లీన్ ఆంధ్రప్రదేశ్  కార్యక్రమంపై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.  నగర పాలక సంస్థ పరిది లో పని చేస్తున్న రిసోర్స్ పర్సన్ లకు అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా మేయర్ మాట్లాడుతూ, మన ఇంటి పరిసరాలతో పాటు వార్డులను పరిశుభ్రంగా ఉంచడానికి ప్రజలు సహకరించే విధంగా వారిని చైతన్య పరచాలన్నారు. పేరుకు పోయిన చెత్తను ఎప్పటికప్పుడు శుభ్రం చేయించడంతోపాటు, నగరం మొత్తం క్లీన్ అండ్ గ్రీన్ గా ఉంచేలా అధికారులు, సిబ్బంది క్రుషి చేయాలన్నారు. శిక్షణ ద్వారా తెలుసుకున్న అంశాలను ప్రజలకు తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో  డిప్యుటీ మేయర్ వాసంతి సాహితీ, మునిసిపల్ కమిషనర్ .వి.వి యస్ మూర్తి, డిప్యుటీ కమిషనర్ రమణా రెడ్డి , అనిల్ 37 వ కార్పొరేటర్, టౌన్ ప్రాజెక్ట్ అధికారి  విశ్వజ్యోతి, సిటీ మిషన్ మేనేజర్ శ్రీనివాస రెడ్డీ,  కమ్యునిటీ ఆర్గనైజర్లు, రిసోర్స్ పర్సన్ లు పాల్గొన్నారు.
సిఫార్సు