కనకదుర్గమ్మను దర్శించుకున్న మంత్రి శంకరనారాయణ
Ens Balu
3
Vijayawada
2020-09-01 10:44:39
రాష్ట్ర ప్రజలు ఆయురారోగ్య, అష్టైశ్వర్యాలతో విరాజిల్లాలని కరోనా పూర్తిగా తుడిచి పెట్టుకుపోయేలా చూడాలని ఆ దుర్గమ్మను మొక్కుకున్నట్టు ఆర్ అండ్ బి శాఖ మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ చెప్పారు. మంగళవారం ఆయన విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వున్న దుర్గమ్మను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహిం చారు. ఉదయం ఇంద్రకీలాద్రికి కుటుంబ సమేతంగా చేరుకున్న మంత్రి శంకరనారాయణ, కనక దుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలకు పూర్తిస్థాయిలో సంక్షేమ పథకాలు అందాలని ఏ ఒక్కరూ నష్టపోకుండా ఉండాలన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రజలకు ఎల్లప్పుడూ మేలు చేయడానికి ఉంటుంది తప్పా, టిడిపి చేస్తున్నట్టు రాజయకీయం చేయ దన్నారు. గతంలో ఏ ప్రభుత్వమూ చేయని విధంగా హామీలన్ని 90శాతం ఏడాదిన్నర పాలనలోనే అమలు చేసిన ఘనత మా ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. ఈ విషయంలో సీఎం ఎంతో నిబద్దతో ఉన్నారని చెప్పిన మంత్రి టిడిపి ఎన్ని కుటిల ప్రయత్నాలు చేసినా, ఎల్లో మీడియా ద్వారా ఎలాంటి విష ప్రచారం చేసినా ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు.