అర్. టి.సి. బస్సు ట్రిప్పులు పెంపు..


Ens Balu
4
Srikakulam
2021-06-20 13:25:42

శ్రీకాకుళం జిల్లాలో సోమవారం నుంచి కర్ఫ్యూ సడలింపు వలన ఆర్.టి.సి బస్సుల రవాణా పెంచుతున్నట్లు డివిజనల్ మేనేజరు జి. వరలక్ష్మి తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన జారీ చేస్తూ కర్ఫ్యూ సడలింపు ఉదయం 6 నుండి సాయంత్రం 6 గంటల వరకు పెంచడం వలన ప్రజా రవాణా పెంచుతున్నామని,   శ్రీకాకుళం -1 డిపో నుండి 42 బస్సులు, శ్రీకాకుళం-2 డిపో నుండి 44 బస్సులు, పాలకొండ డిపో నుండి 42 బస్సులు, పలాస డిపో నుండి 46 బస్సులు, టెక్కలి  డిపో నుండి 35 బస్సులు మొత్తం 209 బస్సులు తిప్పుతున్నట్లు ఆమె చెప్పారు. ఈ అవకాశాన్ని ప్రయాణీకులు గమనించి సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.