వైఎస్సార్ సంపూర్ణ పోషణ సెప్టెంబరు 7 కి వాయిదా..
Ens Balu
1
Visakhapatnam
2020-09-01 12:50:15
భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతికి సంతాప సూచకంగా "వైఎస్సార్ సంపూర్ణ పోషణ" కార్యక్రమాన్ని ప్రభుత్వం సెప్టెంబర్ 7వ తేదీకి వాయిదా వేసినట్టు మహిళా శిశు సంక్షేమ శాఖ పథక సంచాలకులు సీతామహాలక్ష్మీ తెలియజేశారు. మంగళవారం ఆమె విశాఖలో మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకం కార్యక్రమాన్ని వాయిదా వేశామన్నారు. అయితే ఇప్పటికే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశ్యం అంగన్ వాడీలకు తెలియజేయడం జరిగిందన్న ఆమె సెప్టెంబరు 7వ తేదీ లోపు అన్ని కేంద్రాల్లో కార్యక్రమం చేపట్టడానికి ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా ఆదేశించామన్నారు. వైఎస్సార్ సంపూర్ణ పోషణ కార్యక్రమం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఒకే విధాంగా గర్భిణీలు, బాలింతలు, చిన్న పిల్లలకు పోషణ కు సంబంధించిన పౌష్టికాహారం ఇవ్వడం జరుగుతుందన్నారు. గతంలో ఒక్కోచోట ఒక్కో విధంగా ఈ కార్యక్రమం జరిగేదని ఇపుడు పథకం అందరికీ పూర్తిస్థాయిలో అందేలా ప్రభుత్వం తీర్చిదిద్దినట్టు ఆమె వివరించారు.