ప్రజల సహకారంతో క్లాప్ విజయవంతం..


Ens Balu
3
Anantapur
2021-06-21 15:11:43

ప్రజలందరూ కలసికట్టుగా క్లాప్ ను విజయవంతం చేద్దామని నగర మేయర్ వసీం పిలుపునిచ్చారు.  మున్సిపల్ ఆర్ డి కార్యాలయంలో క్లాప్ కార్యక్రమంపై కార్పొరేటర్లు, రిసోర్స్ పర్సన్స్, కమ్యూనిటీ ఆర్గనైజర్లుకు సోమవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా  నగర మేయర్ మహమ్మద్ వసీం మాట్లాడుతూ, ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ క్లాప్ గొప్ప కార్యక్రమమన్నారు.పారిశుధ్యం ను మెరుగు పరిచేందుకు క్లాప్ కార్యక్రమం ఎంతో ఉపయోగ పడుతుందని పేర్కొన్నారు. క్లాప్ కార్యక్రమం విజయవంతం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని అందులో మనమంతా భాగస్వామ్యం కావాలన్నారు. క్లాప్ కార్యక్రమాన్ని విజయవంతం చేసి రాష్ట్రంలో అనంతపురం నగరాన్ని అగ్రస్థానంలో నిలుపుదామని పిలుపునిచ్చారు .ఈ సందర్భంగా క్లాప్ కార్యక్రమంపై అధికారులు వివరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ వాసంతి, నగర కమిషనర్ పివివిఎస్ మూర్తి డిప్యూటీ కమిషనర్ రమణారెడ్డి, మెప్మా పిడి రమణా రెడ్డి,ఎన్విరాల్మెంట్ డి ఈ రాంప్రసాద్ రెడ్డి,మెప్మా, సాహిత్య,రీజినల్ డైరెక్టర్ నాగరాజు, రోజా తదితరులు పాల్గొన్నారు.