ధ్యాన్ చంద్ అవార్డు గ్రహీతకు మంత్రి సత్కారం...
Ens Balu
2
Seethammadara
2020-09-01 13:17:22
క్రీడాకారులకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో ఆయనను మర్యాద పూర్వకంగా కలసిన అంతర్జాతీయ క్రీడాకారిణి (బాక్సింగ్, మహిళా విభాగం) ఎన్. ఉషానుద్దేశించి మాట్లాడారు. రాష్ట్రంలో ఉన్న క్రీడాకారులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందన్నారు. మహిళా విభాగం నుండి బాక్సింగ్ లో గత నెల 29వ తేదీన భారత రాష్ట్రపతి చే ఆన్ లైన్ లో ద్యాన్ చంద్ అవార్డు ను ఎన్. ఉషా ఆన్ లైన్ లో స్వీకరించిన సందర్భంగా మంత్రి ఆమెను అభినందించారు. అంతర్జాతీయ స్థాయిలో నాలుగు సార్లు బంగారు పథకం, నాలుగు సార్లు సిల్వర్, మూడు సార్లు బ్రాంజ్ పథకాలను సాధించినట్లు ఆయన వివరించారు. జాతీయ స్థాయిలో బంగారు, సిల్వర్, బ్రాంజ్ పథకాలను సాధించినట్లు ఆయన చెప్పారు. ఐ. వెంకటేశ్వరరావు కోచ్ గా విశాఖలోని స్పోర్ట్స్ అధారిటీ ఆఫ్ ఇండియా లోనే కోచింగ్ తీసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె రైల్వే లో బాక్సింగ్ కోచ్ గా కొనసాగుతున్నారు. ఈ కార్యక్రమంలో సెట్విస్ సిఇఓ బి. శ్రీనివాసరావు, జిల్లా క్రీడా అధికారి ఎన్. సూర్యారావు, రాష్ట్ర బాక్సింగ్ అసోసియేషన్ కార్యదర్శి బి. లక్ష్మణ్ దేవ్, జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ కార్యదర్శి బి. అప్పన్ రెడ్డి, ద్రోణాచార్య అవార్డు గ్రహీత, బాక్సింగ్ కోచ్ ఐ. వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.