జూలై 10న జాతీయ లోక్ అదాలత్..


Ens Balu
3
Ongole
2021-06-23 12:58:27

రాజీ మార్గం ద్వారా కేసులను పరిష్కరించు కోవడాని కి నేషనల్ లోక్ అదాలత్  చక్కటి పరిష్కార వేదికని ప్రకాశం జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి వెంకట జ్యోతిర్మయి అన్నారు జూలై నెల 10వ తేదీ దేశవ్యాప్తంగా నిర్వహించే నేషనల్ లోక్ అదాలత్ లో భాగంగా ప్రకాశం జిల్లాలోని అన్ని న్యాయస్థానాలలో నేషనల్ లోక్ అదాలత్ నిర్వహించబడుతుంది అని ఈ సందర్భంగా రాజీ పడదగిన అన్ని క్రిమినల్ కేసులు మరియు అన్ని రకాల సివిల్ కేసులు మోటారు వాహన ప్రమాద బీమా పరిహారం చెల్లింపు కేసులు వివాహ సంబంధం కేసులు మరియు  చెక్ బౌన్స్ కేసులు పరిష్కరించ పడతాయని ఈ అవకాశాన్ని కక్షిదారులు ఇరువురూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.