కపిలతీర్ధం కాలువకు ప్రణాళికలు సిద్ధం చేయాలి..
Ens Balu
3
Tirupati
2020-09-01 15:55:52
తిరుపతిలోని శ్రీనిధి అపార్ట్మెంట్ కు దక్షిణం వైపు పు ప్రహరీ గోడ మీదుగా శివ జ్యోతి నగర్ లో ప్రవహించుచున్న కపిల్ తీర్థం కాలువ కలిపేందుకు ప్రణాళికలను తయారు చేయమని ఇంజనీరింగ్ అధికారులను కమిషనర్ గిరీష ఆదేశించారు. నగరపాలక సంస్థ పరిధిలోని శివ జ్యోతి నగర్, కొత్తపల్లి, దేవేంద్ర థియేటర్ రోడ్డు, హరిశ్చంద్ర స్మశాన వాటిక మొదలగు ప్రదేశాలలో ఇంజనీరింగు, పట్టణ ప్రణాళిక అధికారులతో కలిసి మంగళవారం ఉదయం కమిషనర్ గిరీష పర్యటించారు. ఆ ప్రాంతాల్లో గుంతలు, మురుగునీరు పోయే దానికి పైప్ లైన్లు, యుడిఎస్ పైపులను పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీనిధి అపార్ట్మెంట్ యజమానులతో మాట్లాడారు. ప్రధాన రోడ్డులో, ఇసుక, కమ్మి, ఇటుక మొదలగు వ్యర్ధాలు రోడ్ లో ఉండకూడదని, ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా చేసే వారిపై ఫైన్ లు విధిస్తామని హెచ్చరించారు. కొత్తపల్లి లో పర్యటించి, ఎక్కడ ఎంతమేరకు రోడ్డు అవసరమో అధికారులు అడిగి తెలుసుకున్నారు. రోడ్డు ఎంత వరకు అవసరమో ప్లాన్ ద్వారా రెండు రోజుల లోపల తెలియజేయాలని ఆదేశించారు. అనంతరం దేవేంద్ర థియేటర్ రోడ్డు హరిశ్చంద్ర స్మశాన వాటిక లో స్మార్ట్ సిటీ నిధులతో జరుగుతున్న పనులను పరిశీలించి, పనులు త్వరిత గతిన పూర్తి చేయాలని ఇంజనీరింగ్, కాంట్రాక్టర్లు ఆదేశించారు. కమిషనర్ వెంట డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ విజయ్ కుమార్ రెడ్డి, అసిస్టెంట్ సిటీ ప్లానర్ షణ్ముగం,ఎయికామ్ ప్రతినిధులు బాలాజీ, కాంట్రాక్టర్లు తదితరులు పాల్గొన్నారు.