సింహాద్రినాథునికి రూ.50వేలు విరాళం..


Ens Balu
2
Simhachalam
2021-06-27 07:11:08

సింహాచలం శ్రీశ్రీశ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామివారికి విశాఖ విశాలాక్షి నగర్ కు చెందిన భక్తుడు జి.సురేష్ రూ.50వేలు విరాళాన్ని అందించారు. ఈ మేరకు పీఆర్వో కార్యాలయ కౌంటర్ లో నగదు అందించి రసీదు పొందారు. 05-05-2021న  కాలం చేసిన తమ మావయ్య మోటుపల్లి వీరభద్రుడు, సూర్యకాంతంల  పేరుతో అన్నదానం చేయాలని సురేష్ దేవస్థాన అధికారులను కోరారు. ఈ సందర్భంగా దాతలకు ఉచిత దర్శనం కల్పించి, తీర్ధ ప్రసాదాలను ఆలయ అధికారులు అందించారు. అటు సింహాచలం వరాహలక్ష్మీ నృసింహస్వామి ఉపాలయాలైన పైడితల్లి, బంగారమ్మ ఆలయాలకు  సింహాచలంకు చెందిన భక్తుడు రాజగోపాలరావు రూ.30వేలను విరాళంగా ప్రకటించారు. వాటితో అమ్మవార్ల ఆలయాలను అభివ్రుద్ధి చేయాలని దాత కోరారు. ఆ మొత్తాన్ని ఉపాలయాల అర్చకుడు సంతోష్ కు చెక్ ను అందించారు.