విశాఖలోని సింహాచలం శ్రీశ్రీశ్రీ రాహలక్ష్మీనృసింహస్వామి వారి దేవస్థానంలో హుండీల ద్వార లభించిన చిల్లర 6.లక్షల 27వేల 305 రూపాయలు వచ్చిందని ఈఓ ఎంవీ సూర్యకళ తెలియజేశారు. బుధవారం ఆమె ఆలయంలో మీడియాతో మాట్లాడారు. ఆలయంలోని అన్నిహుండీల్లోని చిల్లరను పరకామణి లో లెక్కించగా ఈ మొత్తం వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్టు ప్రత్యేక ఆహ్వానితులు, విజెఎఫ్ అధ్యక్షులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు స్వయంగా పర్యవేక్షించడంతోపాటు పరకామణి సేవలో పాల్గొన్నట్టు ఆమె వివరించారు.