నిరుపేదల దేవుడు డా.వైఎస్సార్...మేకపాటి


Ens Balu
5
Nellore
2020-09-02 12:19:56

ఎవరైనా ఓ మనిషి దూరమైతే ఆ కుటుంబం మాత్రమే శోకంలో మునుగుతుంది. కానీ, తెలుగు రాష్ట్రాల ప్రజలు మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డిని కోల్పోయి దు:ఖించినపుడు కన్నీటిసంద్రంలా మారిందని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పేర్కొన్నారు. ఆ మనసున్న మారాజు నిష్క్రమించి 11 ఏళ్లవుతున్నా ప్రతి తెలుగు వ్యక్తి ఇంకా ఆయన లేని లోటు నుంచి బయటపడలేకపోతున్నారన్నారు.  వైఎస్ రాజశేఖర్ రెడ్డి నుంచి వైఎస్ జగనక్ మోహన్ రెడ్డి వరకూ వైఎస్ వసుదైక కుటుంబంలో 'మేకపాటి' కుటుంబం కూడా సభ్యులవడానికి మించినదేది లేదని గౌతమ్ రెడ్డి పేర్కొన్నారు.  సంక్షేమం, అభివృద్ధి అనే పదం వినపడితే ప్రతి ఒక్కరికీ గుర్తొచ్చే స్థాయిలో..గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయారని మేకపాటి తెలిపారు. వ్యవసాయం, విద్య, వైద్యం, నీటి ప్రాజెక్టులు, ఇళ్లు ఇలా కోట్లాది మందికి సంక్షేమాన్ని అందించి వారి భవితను, తలరాతను మార్చడం వైఎస్ వల్లే సాధ్యమని మంత్రి మేకపాటి స్పష్టం చేశారు. అయితే తండ్రికి తగ్గ తనయుడిగా అవతరించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రూపంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వైఎస్ స్థాయి భరోసా దొరికిందనడంలో సందేహం లేదని మంత్రి అన్నారు. జననం, మరణం ప్రతి మనిషికి..పుట్టుక తప్ప చావులేని మనీషి వైఎస్ అని మంత్రి మేకపాటి స్మృతించి..ఘనమైన నివాళి పలికారు. శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని మంత్రి కార్యాలయంలో జరిగిన వైఎస్ఆర్ వర్ధంతి కార్యక్రమంలో ఆత్మకూరు నియోజకవర్గ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.