అక్కడి ఇంటర్నెట్ కష్టాలపై..కన్నెత్తి చూడని అధికారులు


Ens Balu
1
Sankhavaram
2020-06-23 11:12:58

గ్రామసచివాలయాల్లో ఏపి ఫైబర్ నెట్ కనెక్ట్ కాకపోవడంతో సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మంగళవారం శంఖవరంలోని గ్రామసచివాలయాల్లో ఏపి ఫైబర్ నెట్ మొరాయించడంతో ప్రభుత్వం నిర్ధేశించిన సర్వీసు రిక్వెస్టులు చేయడానికి వీలుపడక వివిధ పనులకు దరఖాస్తులు చేసుకోవడానికి వచ్చిన వారంతా వెనుతిరిగి వెళ్లిపోవాల్సి వస్తుంది. నెట్ కనెక్ట్ కాకపోవడంతో సిబ్బంది తమ సొంత మొబైల్స్ లలో నెట్ వినియోగించి సచివాల పనులు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. మరోవైపు ఇంటరెన్ కష్టాలను ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదు. ఆ ప్రభావం సచివాల సిబ్బందిపై పడుతోంది.