రెడ్ జోన్ లోకి మారిన అన్నవరం


Ens Balu
2
Annavaram Temple
2020-06-23 11:16:51

అన్నవరం ఆంధ్రాబ్యాంకు ఏరియా లో 2కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో అధికారులు ఈప్రాంతాన్ని రెడ్ జోన్ గా ప్రకటించారు. మంగళవారం కరోనా సోకిన వారిని అంబులెన్సులో కాకినాడ తరలించినట్టు ఆర్ఐ భాస్కర ప్రసాద్ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, 3సచివాలయాల కార్యదర్శిలు సమన్వయంతో ప్రత్యేక పారిశుధ్య నిర్వహణ కూడా చేపడుతున్నట్టు చెప్పారు. డాక్టర్ రవికుమార్ ఆధ్వర్యంలో మెడికల్ ఔట్ పోస్టును ఏర్పాటుచేశామన్నారు. కరోనా వైరస్ అన్నవరంలో ప్రబలిన కారణంగా ఈ ప్రాంతంలో లాక్ డౌన్ విధించినట్టు చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి మాస్కులు ధరలించాలన్నారు. ఎవరిలోనైనా కరోనా లక్షణాలు కనిపిస్తే తక్షణమే సమాచారం అందించాలని ఆయన కోరారు. సీనియర్ అసిస్టెంట్  నగేష్, 3 సచివాలయ కార్యదర్శిలు వీఆర్ఏ శ్రీను తదితరులు పాల్గొన్నారు.