జ్ఞానవేణి ఎంపిక పట్ల ఉద్యోగుల హర్షం..


Ens Balu
4
Seethammadara
2021-08-09 14:41:46

ఆంధ్ర ప్రదేశ్ దేశ్ ఎస్సీ,ఎస్టీ గెజిటెడ్ అధికారుల సంక్షేమ సంఘం నూతన కార్యవర్గంలో స్టేట్ జనరల్ బాడీకి యునానిమస్ గా  జ్ఞానవేణి కుంచే వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నిక కావడం పట్ల విశాఖజిల్లా యూనిట్ మరియు రెవిన్యూ అధికారులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు విశాఖ తహశీల్దార్ కార్యాలయంలో  జ్ఞానవేణి కుంచేని కలిసి సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తనను రాష్ట్రకార్యవర్గంలో స్థానం దక్కడమంటే తనపై బాధ్యత మరింత అధికంగా పెట్టినట్టేనన్నారు. యూనియన్ అభివ్రుద్ధి, అధికారుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి శక్తివంచన లేకుండా క్రుషిచేస్తానని ఆమె ఈ సందర్భంగా చెప్పారు. అధికారులు, ఉద్యోగులకు ఎలాంటి సమస్య వున్న తక్షణమే తనను సంప్రదిస్తే..విషయాన్ని రాష్ట్ర కమిటీలో చర్చించి పరిష్కారిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో విశాఖపట్నం జిల్లా ఎస్సీ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.