మున్సిపల్ పార్కులో ఉచిత యోగా శిక్షణ తరగతులు
                
                
                
                
                
                
                    
                    
                        
                            
                            
                                
Ens Balu
                                 5
                            
                         
                        
                            
Tirupati
                            2020-09-05 16:49:44
                        
                     
                    
                 
                
                    తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో కరోనా మహమ్మారి విస్తరించకుండా, వ్యాధినిరోధక శక్తిని పెంచేందుకు ప్రకాశం పార్కులో యోగా శిక్షణా తరగతులు నిర్వహిం చనున్నామని నగరపాలక సంస్థ కమిషనర్  గిరీషా తెలిపారు. నగరపాలక సంస్థలో ఈమేరకు శనివారం సమీక్ష నిర్వహించారు. అనంతరం జిల్లా యోగా అసోసియే షన్ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం 5 గంటలకు ప్రకాశం పార్కులోని ఆంఫీ థియేటర్ దగ్గర ఈ యోగా తరగతులు నిర్వహించాలని నిర్ణయించారు. కమిషనర్ మాట్లాడుతూ, కరోనా వ్యాధి వ్యాప్తి చెందకుండా వ్యాధినిరోధక శక్తిని పెంచేందుకు  యోగా శిక్షణ తరగతులు ఎంతగానో ఉపయోగపడుతాయన్నారు. ఈ ఆసక్తి కలిగిన నగరప్రజలు ఆదివారం ఉదయం 5 గంటలకు ప్రకాశం పార్కులో ఆంఫీ థియేటర్ కు రావాలని కమీషనర్ పిలుపునిచ్చారు. ప్రజలు పెద్ద సంఖ్యలో విచ్చేసి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.