సుభాష్ చంద్రబోస్ పురస్కారాలకు దరఖాస్తులు ఆహ్వానం


Ens Balu
3
Srikakulam
2020-09-05 18:01:34

శ్రీకాకుళం జిల్లాలో దేశ విపత్తు నిర్వహణ సంస్థ ( ఎన్.డి.ఎం.ఎ ) సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రధాన పురస్కార అవార్టులను ప్రధానం చేయనున్నట్లు జిల్లా రెవిన్యూ అధికారి బలివాడ దయానిధి పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రధాన పురస్కార అవార్డులు – 2021 సంవత్సరానికి  పౌరులు,వివిధ సంస్థల నుండి దరఖాస్తులు కోరుతున్నట్లు ఆయన చెప్పారు. దరఖాస్తులను ఈ నెల 30 లోగా ఆన్ లైన్ లో సమర్పించాల్సి వుంటుందన్న ఆయన ఈ https://dmawards.ndma.gov.in  వెబ్ సైట్ యందు అప్ చేసుకోవాలన్నారు. అర్హత కలిగిన వారందరూ దరఖాస్తు చేసుకొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డిఆర్వో కోరారు.
సిఫార్సు